నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!

- August 28, 2026 , by Maagulf
నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!

మస్కట్: నేపాల్‌లోని పలు ప్రాంతాలను వరదలు, వరద ఉధృతి ముంచెత్తిన నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వం, ప్రజలకు సంఘీభావం ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులకు ఒమన్ ప్రభుత్వం తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ఆకాంక్షిస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఒమన్ ప్రభుత్వం ఆకాంక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com