కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- September 01, 2026
కాశీ: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలను ఆగస్టు 29 నుంచి 31 వరకు నిర్వహించిన కాశీ తెలుగు సంగమం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు సమాజానికి చెందిన పలువురు పాల్గొన్నారు.
కాశీ తెలుగు సంగమం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదిలీల ఆర్గనైజేషన్ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని నిర్వాహకులు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ బోనాల పండుగ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“తెలుగు సంస్కృతి మన గర్వం.. తెలుగు వారి ఐక్యత మన బలం” అనే సందేశంతో కాశీ తెలుగు సంగమం సందర్భంగా నిర్వహించిన బోనాల వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







