రెక్లెస్ డ్రైవింగ్పై న్యూ రాడార్స్ కొరడా
- August 19, 2016
రోడ్లపై అతి వేగంతో, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిని ఖచ్చితత్వంతో గుర్తించడానికిగాను కొత్త రాడార్లను రోడ్లపై అమర్చారు. ఆదివారం నుంచి ఈ రాడార్లు, నిబంధనల్ని అతిక్రమించినవారిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిస్తున్నాయి. ఆ సమాచారం ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. మొదటి దశలో మొత్తం 10 రాడార్లను ఇన్స్టాల్ చేశారు.అల్ ఇత్తిహాద్ రోడ్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్లో కొత్త రాడార్లను ఏర్పాటు చేయనున్నారు. ముందు ముందు కొత్త రాడార్ల సంఖ్యను ఇంకా పెంచనున్నారు. అలాగే ఈ రాడార్ల ద్వారా ట్రాఫిక్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని, క్రమబద్దీకరించడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. అతి వేగం కన్నా ప్రాణాలు ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









