రెక్లెస్ డ్రైవింగ్పై న్యూ రాడార్స్ కొరడా
- August 19, 2016
రోడ్లపై అతి వేగంతో, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిని ఖచ్చితత్వంతో గుర్తించడానికిగాను కొత్త రాడార్లను రోడ్లపై అమర్చారు. ఆదివారం నుంచి ఈ రాడార్లు, నిబంధనల్ని అతిక్రమించినవారిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిస్తున్నాయి. ఆ సమాచారం ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. మొదటి దశలో మొత్తం 10 రాడార్లను ఇన్స్టాల్ చేశారు.అల్ ఇత్తిహాద్ రోడ్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్లో కొత్త రాడార్లను ఏర్పాటు చేయనున్నారు. ముందు ముందు కొత్త రాడార్ల సంఖ్యను ఇంకా పెంచనున్నారు. అలాగే ఈ రాడార్ల ద్వారా ట్రాఫిక్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని, క్రమబద్దీకరించడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. అతి వేగం కన్నా ప్రాణాలు ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







