గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- September 10, 2026
మంగళగిరి: గల్ఫ్ దేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రవాస కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై APNRT సీఈఓ డా. కృష్ణమోహన్ తో చర్చించినట్లు తెలిపారు. మంగళగిరిలోని APNRT కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గల్ఫ్ కార్మికుల సమస్యలు, వీసా, ఇమ్మిగ్రేషన్, ఉద్యోగ సంబంధిత అంశాలు తదితర విషయాలపై వివరంగా చర్చించారు.
గల్ఫ్లో తనకు ఉన్న అనుభవం ఆధారంగా పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించగా, APNRT సీఈఓ డా. కృష్ణమోహన్ వాటిని సానుకూలంగా స్వీకరించి అభిప్రాయాలను తీసుకున్నారని తెలిపారు.
అనంతరం APNRT డైరెక్టర్ నాగేంద్రబాబు తో పాటు హెల్ప్లైన్ టీమ్ సభ్యులతో కూడా సమావేశమై ప్రవాసాంధ్రులకు అందుతున్న సేవలు, సమస్యల పరిష్కార విధానం, మరింత సమర్థవంతమైన సహాయ చర్యలపై చర్చించారు.
గల్ఫ్లోని ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రవాసుడికి అవసరమైన సమయంలో అండగా నిలిచి, సమస్యలు తలెత్తకముందే అవగాహన కల్పించే విధంగా APNRTతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని APNRT గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసు తెలిపారు.

తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







