తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు..
- August 20, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై అభిప్రాయాలు సేకరించనున్నారు. దసరా నుంచి ఎలాగైనా కొత్త జిల్లాలను ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీని కోసం ఓ వైపు కార్యాచరణ రూపొందిస్తూనే అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ప్రభుత్వం నియమించిన సబ్కమిటీ కొత్త జిల్లాలపై నివేదికను సీఎంకు సమర్పించింది. కొత్తగా 27 జిల్లాలను, 58 రెవెన్యూ డివిజన్లను 533 మండలాలను ప్రతిపాదించింది ఉపసంఘం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ కూడా దీనికి హాజరవుతారు.మంత్రివర్గ ఉపసంఘం నివేదికను అఖిలపక్ష సమావేశం ముందు ఉంచనున్నారు. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి.కాకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం చేసే జిల్లాలను వ్యతిరేకించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేలా జిల్లాల విభజన సరికాదంటున్నాయి. అఖిలపక్ష సమావేశానికి ముందే సబ్ కమిటీ ప్రతిపాదనలను తమకు ఇవ్వాలని కోరుతున్నాయి. నివేదిక ఇస్తే ప్రభుత్వం ప్రతిపాదనలపై అధ్యయనం చేసి అభిప్రాయాలు చెప్పడానికి వీలవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీఎస్ రాజీవ్శర్మకు లేఖ రాశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







