షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- September 11, 2026
షార్జా: భారత సినీ దిగ్గజం, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి సెప్టెంబర్ 12న షార్జా ఎక్స్పో సెంటర్ వేదికగా ప్రేక్షకులను అలరించనున్నారు. మమ్ముట్టి సినీ ప్రయాణంలో ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని ఘనంగా స్మరించుకుంటూ ‘రాజకీయమ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కేరళ సినీ రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన మమ్ముట్టి ఈ ఏడాది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్తో సత్కరించబడ్డారు. 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన మూడు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా పలు రాష్ట్రస్థాయి అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు.
ప్రముఖుల సందడి
షార్జా ఎక్స్పో సెంటర్లో జరగనున్న ‘రాజకీయమ్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్లేబ్యాక్ సింగర్లు, సంగీత కళాకారులు పాల్గొని మమ్ముట్టి సినీ ప్రస్థానాన్ని ఘనంగా స్మరించుకోనున్నారు. ప్లాటినమ్లిస్ట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ప్రముఖ భారతీయ సినీ దర్శకులు హరిహరన్, అడూర్ గోపాలకృష్ణన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
సాయంత్రం 6.30 గంటలకు కార్యక్రమం
సెప్టెంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు ‘రాజకీయమ్’ షో ప్రారంభం కానుంది. ప్రేక్షకుల కోసం సాయంత్రం 4 గంటలకు గేట్లు తెరవనున్నారు. టికెట్లు ప్లాటినమ్లిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సీటింగ్ అన్రిజర్వ్డ్గా ఉంటుంది.
టికెట్ ధరలు
టికెట్లు వివిధ కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి:
- బ్రాంజ్: Dh50
- సిల్వర్: Dh100
- గోల్డ్: Dh150
- ప్లాటినమ్: Dh300
- డైమండ్: Dh500
- టైటానియం: Dh1,000
మమ్ముట్టి ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం UAEలోని మలయాళీ సినీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







