యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్‌’కు ప్రియదర్శిని ఎంపిక

- September 12, 2026 , by Maagulf
యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్‌’కు ప్రియదర్శిని ఎంపిక

దుబాయ్: యూఏఈ నుంచి ప్రియదర్శిని తిరుపతిరాజన్‌ 89వ ‘నో ఇండియా ప్రోగ్రామ్‌’ (KIP)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ హెడ్ఆఫ్‌ ఛాన్సరీ (HOC) & కాన్సుల్‌ (కల్చర్) చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

భారతీయ ప్రవాస యువతకు భారత్‌తో మరింత అనుబంధాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నో ఇండియా ప్రోగ్రామ్‌’లో భాగంగా ప్రియదర్శిని ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, దేశం సాధిస్తున్న అభివృద్ధి, పురోగతిపై అవగాహన పొందే అవకాశం కలుగుతుంది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రతో ప్రవాస భారతీయ యువతను అనుసంధానించడమే KIP ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమం ప్రియదర్శినికి ఎంతో విలువైన, జ్ఞాపకంగా నిలిచిపోయే అనుభవాన్ని అందించాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ ఆకాంక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com