‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
- September 12, 2026
‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరో నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్తో వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.
‘అలియాస్ రుక్మిణి’ 10 రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్లో హీరో నితిన్తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు పాల్గొన్నారు.
యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నాని సమర్పకుడిగా వ్యవహరించడం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను మరింత పెంచుతోంది. లైట్ హార్ట్ హాస్యంతో కూడిన గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో నితిన్ చాలా యూనిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఐఎస్సి సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తుండగా, విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్గా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.
తారాగణం: నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవాసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







