మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

- September 12, 2026 , by Maagulf
మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన సాగర తీర మహాగణపతి ఆలయ కమిటీ సభ్యులు

అమరావతి: మచిలీపట్నం మంగినపూడి తీరంలో నిర్వహించనున్న సాగర తీర మహాగణపతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.

ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాగర తీర మహాగణపతి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కలసి, మంగినపూడి సముద్ర తీరంలో నిర్వహించనున్న మహాగణపతి ఉత్సవాల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా మచిలీపట్నంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.

మంగినపూడి తీరంలో ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాధాన్యతను పెంపొందించేలా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మచిలీపట్నం సాగర తీరానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు, స్థానిక పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com