'సిగ్మా' తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్
- September 15, 2026
సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’కు మరింత బలం చేకూరింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్లో రిలీజ్ చేస్తోంది.
‘సిగ్మా’కు ఈ అసోసియేషన్ ఒక పెద్ద అడ్వాంటేజ్గా నిలవనుంది. తెలుగు మార్కెట్లో బలమైన మార్కెట్ ప్రెజెన్స్తో పాటు డిస్ట్రిబ్యూషన్లో మంచి అనుభవం ఉన్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఇప్పటికే పలు బ్లాక్బస్టర్ చిత్రాలను విజయవంతంగా రిలీజ్ చేసింది. ఇప్పుడు ‘సిగ్మా’తోనూ సినిమాకు మ్యాసీవ్ రీచ్, స్ట్రాంగ్ థియేట్రికల్ పొజిషనింగ్ లభించనుంది.
భారీ స్థాయిలో సినిమాలను నిర్మించడంలో పేరున్న లైకా ప్రొడక్షన్స్, తెలుగు మార్కెట్తో పాటు దేశవ్యాప్తంగా బలమైన నెట్వర్క్, రిప్యూటేషన్ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ కలిసి రావడం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఎన్వీఆర్ సినిమా అసోసియేషన్ కూడా మరో ప్లస్గా నిలవనుంది.
ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. హరిహరసుతన్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు.
అక్టోబర్ 2న ‘సిగ్మా’ థియేటర్లలోకి రానుంది. గాంధీ జయంతి హాలిడేకు తోడు వీకెండ్ కూడా కలసి రావడంతో సినిమాకు మంచి అడ్వాంటేజ్ లభించనుంది. యాక్షన్-అడ్వెంచర్ అప్పీల్, బలమైన టెక్నికల్ టీమ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా మద్దతుతో ‘సిగ్మా’ గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమౌతోంది.
తాజా వార్తలు
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి







