తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- September 16, 2026
తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, భక్తులకు అత్యంత సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, తిరుమలలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల (EV Buses) సేవలు బుధవారం నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉచిత ఈవీ బస్సులను ఘనంగా ప్రారంభించారు.
రిలయన్స్ మరియు బయోటెక్ సహకారంతో ఉచిత బస్సుల విరాళం
తిరుమల కొండపై పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. అలాగే మరో బయోటెక్ సంస్థ అదనంగా 7 బస్సులను టీటీడీకి (TTD) ఉచితంగా అందజేశాయి. కేవలం బస్సుల అందించడమే కాకుండా, ‘జియో-బీపీ’ (Jio-BP) సహకారంతో తిరుమలలో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర అధునాతన మౌలిక వసతులను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయడం విశేషం.
అనంత్ అంబానీ ఇచ్చిన హామీ సాకారం
గత జూన్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ.. తిరుమల కొండపై కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తరఫున 25 ఈవీ బస్సులను విరాళంగా ఇస్తామని టీటీడీకి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఈ బస్సులు తిరుమలకు చేరుకుని నేడు భక్తుల సేవలకు అంకితమయ్యాయి.
బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం
ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ ఉచిత ఈవీ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. మాడ వీధులు, భక్తులు బస చేసే కాటేజీలు, మరియు దర్శన క్యూలైన్ల ప్రాంతాల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్
- కువైట్ ఇతరుల లగేజీపై ప్రయాణికులకు కీలక హెచ్చరిక..!!
- ఓజోన్ పొర పరిరక్షణకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- ఖతార్లో విస్తరిస్తోన్న స్మార్ట్ సిటీల మార్కెట్..!!
- మక్కా టార్గెట్ గా హౌతీ డ్రోన్.. కూల్చివేసిన సౌదీ..!!







