36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఇరాక్ లో ఉరితీత...

- August 21, 2016 , by Maagulf
36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఇరాక్ లో ఉరితీత...

36 మంది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను ఇరాక్ ఆదివారం ఉరితీసింది. 2014లో సున్నీ జిహాదీలు, సంకీర్ణ తీవ్రవాదులు కలిసి టిక్రిట్ నగరంలోని ఆర్మీ స్థావరంపై దాడిచేసి వందలాదిమందిని ఊచకోత కోశారు. 17 వందల మంది ఆర్మీ రిక్రూటర్లను అపహరించిన ఉగ్రవాదులు వారిలో 300 మందిని అతి దారుణంగా చంపేశారు. స్పీచర్ నరమేధంగా పిలిచే కేసులో 36 మందిని దోషులుగా తేల్చిన కోర్టు గతేడాది మరణశిక్ష విధించింది. నసిరియా కారాగారంలో ఆదివారం వీరికి మరణశిక్ష అమలు చేసినట్టు ధిఖార్‌లోని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మరణిశిక్షను తిలకించేందుకు బాధిత బంధువులు చాలామంది జైలుకు చేరుకున్నారు. ఉగ్రవాదులను ఉరితీస్తున్నప్పుడు సంతోషంతో 'అల్లాహు అక్బర్' అని పెద్ద ఎత్తున నినదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com