జపాన్ రాజధాని టోక్యోను భారీ తుఫాను 'మిండుల్లే' వణికిస్తోంది..
- August 22, 2016
జపాన్ రాజధాని టోక్యోను భారీ టైపూన్(తుఫాను) 'మిండుల్లే' వణికిస్తోంది. భారీ ఈదురుగాలులతో తుఫాను సోమవారం టోక్యోను తాకుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టోక్యో నుంచి ఉత్తర తొహుకు ప్రాంతం దిశగా మిండుల్లే ప్రభావం చూపుతుందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను సందర్భంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
టోక్యో నగరంపై మిండుల్లే తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇక్కడ వరదలు, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అధికారులు సుమారు 400 విమానాలను రద్దు చేశారు.ముఖ్యంగా టోక్యోలోని హనెడ విమానాశ్రయంకు రాకపోకలు నిలిచిపోయాయి. 145 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు జపాన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ సైతం 90 విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో..సుమారు 48 వేల మంది విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతున్నట్లు వెల్లడించారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







