నిర్మాతే విష్ణుకు విలన్ గా !
- August 22, 2016
ఆడోరకం ఈడోరకం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు, హీరోగా తెరకెక్కుతున్న సినిమా లక్కున్నోడు. గీతాంజలి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్ వివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ నిర్మాతే విష్ణుకు విలన్ గా మారుతున్నాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్ వివి సత్యనారాయణ ప్రస్తుతం ప్రభుదేవ, తమన్నాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అభినేత్రి సినిమా తెలుగు వర్షన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.అదే సమయంలో మంచు విష్ణు హీరోగా లక్కున్నోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తన రెండో సినిమా శంకరాభరణంలో గెస్ట్ రోల్ లో నటించిన సత్యనారాయణ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో మెయిన్ విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







