నిర్మాతే విష్ణుకు విలన్ గా !
- August 22, 2016
ఆడోరకం ఈడోరకం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు, హీరోగా తెరకెక్కుతున్న సినిమా లక్కున్నోడు. గీతాంజలి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్ వివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ నిర్మాతే విష్ణుకు విలన్ గా మారుతున్నాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్ వివి సత్యనారాయణ ప్రస్తుతం ప్రభుదేవ, తమన్నాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అభినేత్రి సినిమా తెలుగు వర్షన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.అదే సమయంలో మంచు విష్ణు హీరోగా లక్కున్నోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తన రెండో సినిమా శంకరాభరణంలో గెస్ట్ రోల్ లో నటించిన సత్యనారాయణ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో మెయిన్ విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









