స్టోర్ పాలెస్ ప్రారంభించిన మోదీ ...
- August 22, 2016
పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్కు భారతీయుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు అఫ్గాన్ రాజధాని కాబుల్లో పునరుద్ధరించిన స్టోర్ పాలెస్ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కాబుల్లో ఉన్న అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి మోదీ ఈ పాలెస్ ప్రారంభోత్సవం చేశారు. అఫ్గానిస్థాన్తో మంచి స్నేహం ఉందని, ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. బయటి శక్తుల కారణంగా అఫ్గాన్లో కొనసాగుతున్న హింస బాధపెడుతోందని మోదీ అన్నారు. దేశంలో శాంతి భధ్రతలు, అభివృద్ధి పెంపొందడంతో పాటు సంపన్న దేశంగా మారాలని, అఫ్గాన్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.శాంతి ఉగ్రవాదాన్ని, హింసను జయిస్తుందని.. భారత్, అఫ్గాన్ ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉండాలని అఫ్గాన్ అధ్యక్షుడు ఘని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







