స్టోర్ పాలెస్ ప్రారంభించిన మోదీ ...
- August 22, 2016
పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్కు భారతీయుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు అఫ్గాన్ రాజధాని కాబుల్లో పునరుద్ధరించిన స్టోర్ పాలెస్ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కాబుల్లో ఉన్న అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి మోదీ ఈ పాలెస్ ప్రారంభోత్సవం చేశారు. అఫ్గానిస్థాన్తో మంచి స్నేహం ఉందని, ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. బయటి శక్తుల కారణంగా అఫ్గాన్లో కొనసాగుతున్న హింస బాధపెడుతోందని మోదీ అన్నారు. దేశంలో శాంతి భధ్రతలు, అభివృద్ధి పెంపొందడంతో పాటు సంపన్న దేశంగా మారాలని, అఫ్గాన్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.శాంతి ఉగ్రవాదాన్ని, హింసను జయిస్తుందని.. భారత్, అఫ్గాన్ ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉండాలని అఫ్గాన్ అధ్యక్షుడు ఘని అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









