సోమాలియాలో ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి ..
- August 22, 2016
సోమాలియాలో రెండు వేరు వేరు చోట్లలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి చెందగా దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారుల వివరణ ప్రకారం.. గవర్నమెంట్ హెడ్క్వార్టర్స్ గేటు వద్ద ఓ వ్యక్తి పేలుడుపదార్థాలు ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమీపంలోని మార్కెట్ వద్ద మరో వ్యక్తి అలాంటి దాడికే పూనుకున్నాడు. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ ఘటనల్లో పేలుళ్ల ధాటికి స్థానికులు 17మంది అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఈ ఘటనకు పూర్తి భాధ్యత వహిస్తున్నట్లు అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. ఈ విషయమై సోమాలియా ప్రధానమంత్రి ఒమర్ అబ్దిరషీద్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడులకు అమాయక ప్రజలు బలి కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం అందరికి శ్రేయస్కరం అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







