సోమాలియాలో ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి ..

- August 22, 2016 , by Maagulf
సోమాలియాలో  ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి ..

సోమాలియాలో రెండు వేరు వేరు చోట్లలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి చెందగా దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారుల వివరణ ప్రకారం.. గవర్నమెంట్‌ హెడ్‌క్వార్టర్స్‌ గేటు వద్ద ఓ వ్యక్తి పేలుడుపదార్థాలు ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమీపంలోని మార్కెట్‌ వద్ద మరో వ్యక్తి అలాంటి దాడికే పూనుకున్నాడు. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ ఘటనల్లో పేలుళ్ల ధాటికి స్థానికులు 17మంది అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఈ ఘటనకు పూర్తి భాధ్యత వహిస్తున్నట్లు అల్‌-ఖైదా అనుబంధ సంస్థ అల్‌-షబాబ్‌ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. ఈ విషయమై సోమాలియా ప్రధానమంత్రి ఒమర్‌ అబ్దిరషీద్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడులకు అమాయక ప్రజలు బలి కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం అందరికి శ్రేయస్కరం అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com