షార్జా లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని భారతీయ కార్మికుని మృతి
- August 23, 2016
షార్జా : స్థానిక అల్ రోజా 'ఆ ప్రాంతంలో 40 ఏళ్ల భారతీయ కార్మికుడు సోమవారం రాత్రి తన వసతి వద్ద ఒక సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించినాట్లు ఒక పోలీసు అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఈ కార్మికుడు ఒక ప్లాస్టిక్ తాడుని ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ అధికారి తెలిపారు.
ఆసియా దేశస్థులైన సహచర రూమ్మేట్స్ ఉరి వేసుకొన్న వ్యక్తి జీవితాన్ని రక్షించే ప్రయత్నంలో అతని శరీరం దించివేసేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే అతను మరణించినట్లుగా కనుగొన్నట్లుగా పోలీసులకు తెలిపారు. ఆత్మహత్య ఉదంతం గురించి సమాచారాన్నితెలుసుకొన్న తర్వాత సంఘటన స్థలానికి వెళ్లిన పోలీస్ మరియు ఫోరెన్సిక్ బృందాలు వెళ్ళాయి. మృతుని శరీరంను శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు బదిలీ చేశారు.సంఘటనా స్థలం నుంచి అధికారికంగా వేలిముద్రలు మరియు ఇతర వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. లేక ఎవరైనా ఈ కార్మికుని హత్యకు పాల్పడి ఉంటారా అనే కోణంలోను ఘటనా సన్నివేశం నుండి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేశారు.ఆత్మహత్యలకు ముఖ్యంగా కార్మికులు పాల్పడటం దారుణమైన పాపం అని అది ఇస్లాం మతం యొక్క బోధనలకు పూర్తి వ్యతిరేకంగా జరిపే ఒక క్రిమినల్ చర్య అని అధికారులు పేర్కొంటున్నారు. వారి జీవితాలను ముగిసింది గురించి ఆలోచించకుండా ఆపడం హెచ్చరించారు. సమస్యలు చుట్టిముట్టినపుడు ప్రజలు ఓపికతో సహనంతో వారికి మంచి రోజులు వచ్చేవరకు జీవనం ఓర్పుతో గడపాలని కష్టాలు కలకాలం ఉండవని మతపరమైన పండితులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







