సెప్టెంబర్ 25 లోగా వచ్చెయ్యండి: సుష్మా స్వరాజ్ సూచన
- August 24, 2016
సెప్టెంబర్ 25 లోగా వచ్చెయ్యండి: సుష్మా స్వరాజ్ సూచన ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డ భారతీయులెవరైనాసరే సౌదీ నుంచి స్వదేశానికి సెప్టెంబర్ 25 లోపు రావాలనీ, వారికి తగిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 25 తర్వాత వచ్చేవారు మాత్రం, తమ తమ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవని ఆమె స్పష్టం చేశారు. ఇంకో వైపున ఫిలిప్పీన్స్ కూడా తమ పౌరులు స్వదేశానికి వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం, ఇతరత్రా కారణాలతో సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంపెనీలు మూతపడ్డంతో ఉద్యోగాలు లేక, కనీసం తినడానికి తిండి లేక వివిధ దేశాలకు చెందిన వలసదారులు నానా కష్టాలూ పడుతున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే సౌదీలో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







