వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్కల్యాణ్..
- August 24, 2016
కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుపతికి చేరుకున్నారు. వినోద్ కుటుంబసభ్యులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కన్నీటి పర్యంతమైన వినోద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో మూడు రోజుల క్రితం వినోద్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోలారులో జరిగిన ఓ కార్యక్రమంలో ఘర్షణ తలెత్తి వేరే హీరో అభిమాని అయిన యువకుడు పవన్ అభిమాని అయిన వినోద్ను కత్తితో పొడిచాడు.తీవ్ర రక్తస్రావమైన వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన అభిమాని హత్య విషయం తెలుసుకున్న పవన్కల్యాణ్ ఈరోజు తిరుపతికి చేరుకుని అతడి కుటుంబాన్ని పరామర్శించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







