ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రదాడి..

- August 24, 2016 , by Maagulf
ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రదాడి..

ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతుల్లో ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు భద్రతా సిబ్బంది, ముగ్గురు పోలీసులు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 35 మంది విద్యార్థులు, 9 తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు. తరగతి గదుల్లో చిక్కుకున్న 750 మంది విద్యార్థులను, ప్రొఫెసర్లను ఎట్టకేలకు భద్రతా బలగాలు కాపాడాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. 2006లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో 1700కు పైగా విద్యార్థులు చదువుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com