ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రదాడి..
- August 24, 2016
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అఫ్గానిస్థాన్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతుల్లో ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు భద్రతా సిబ్బంది, ముగ్గురు పోలీసులు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 35 మంది విద్యార్థులు, 9 తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు. తరగతి గదుల్లో చిక్కుకున్న 750 మంది విద్యార్థులను, ప్రొఫెసర్లను ఎట్టకేలకు భద్రతా బలగాలు కాపాడాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. 2006లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో 1700కు పైగా విద్యార్థులు చదువుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







