క్వాటిప్ ఆత్మాహుతి బాంబర్ పాకిస్తానీ ప్రవాసీయుడు
- August 25, 2016
మనామా: తూర్పు సౌదీ అరేబియాలో క్వాటిప్ ప్రాంతంలో ఒక మసీదు లో ఆరాధకుల మధ్యకు వెళ్లి తనను తాను పేల్చుకొనేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తికి చెందిన ఒక గుర్తింపు కార్డుని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఒక పాకిస్తానీ దేశానికి చెందినవాడుగా గుర్తించడం జరిగిందని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
బాంబర్ మాఘ్రేబ్లో ( సూర్యాస్తమయం ) క్వాటిప్ ప్రాంతము లో ఉమ్ అల్ హమాం ముస్తఫా మసీదు ప్రార్ధనల సందర్భంగా మంగళవారం ఆత్మాహుతి దాడి చేసేందుకు సంకల్పించాడు. అయితే, మసీదు సమీపంలో భద్రతా సిబ్బంది అతని అనుమానాస్పద కదలికల గమనించి అదుపులోనికి తీసుకొని అతన్నీ ప్రశ్నించడం జరిగింది.
ఆ వ్యక్తి బాంబర్ గా కనుగొన్నారు జరిగింది అనితన వీపు మీద ఒక స్పోర్ట్స్ బ్యాగ్ మోస్తున్నాడు. పోలీసుల కళ్లబడటంతోనే ఆ వ్యక్తి తనను తాను పీల్చుకోవడానికి ప్రయత్నించాడని, మంత్రి బుధవారం మధ్యాహ్నం చెప్పారు.అతని చర్యని గమనించిన పోలీసులు నేరుగా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి తన కదలికని కట్టడి చేశారు. దీనితో ఆ ఆత్మాహుతి సభ్యుని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఆ బాంబర్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మార్గ మధ్యలోనే మరణించాడనిమంత్రి పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న
బ్యాగ్ లో నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు కనుగొనబడింది. పోలీసులు ఆ వ్యక్తి శరీరం యొక్క తనిఖీ శోధన సమయంలో, తన పాకిస్తానీ ప్రవాసీయుని గుర్తించే జాతీయ గుర్తింపు కార్డు కనుగొనబడిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







