రియాద్ లో దొంగల ముఠా కదలిక పై పోలీస్ అప్రమత్తం
- August 25, 2016
రియాడ్: పోలీసులు ఇటీవల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకు వినియోగదారులకు దోచుకొన్న 12 మంది సభ్యులు గల ఒక ముఠాని అరెస్టు చేశారు. ఆ తరహాలోనే రియాద్ లో దొంగల ముఠా సంచరిస్తున్నదని పేర్కొన్నారు. రియాద్ పోలీసు ప్రతినిధి కల్నల్ ఫరజ్ అల్ మైమన్ మాట్లాడుతూ దొంగలు అద్దెకు కార్లను తీసుకొని పగలంతా నగరం చుట్టూ తిరిగి దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూసి దోచుకోనున్నారు అని తెలిపారు.
"ప్రాధమిక విచారణ మేరకు పోలీసులు అనుమానితులు నగరంలో కత్తులు మరియు ఇతర మారణాయుధాలతో బెదిరించడం తరువాత 15 మందిని దోచుకున్నారని " ఆల్-మైమన్ చెప్పారు. అతను అనుమానితులను గుర్తించకుండా ఉండేందుకు అద్దెకు కార్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తొమ్మిది మంది ఇథోపియన్లు , ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక సూడాన్ వ్యక్తి ఈ గ్యాంగ్ లో ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఇరవై ఏళ్ళ ప్రాయం వారని తెలిపారు. అల్ మైమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పౌరులు బ్యాంకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అదనపు పహారా పెంచినట్లు ఆయన వివరించారు. నగరంలో ఉన్న నివాసితులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









