రియాద్ లో దొంగల ముఠా కదలిక పై పోలీస్ అప్రమత్తం
- August 25, 2016
రియాడ్: పోలీసులు ఇటీవల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకు వినియోగదారులకు దోచుకొన్న 12 మంది సభ్యులు గల ఒక ముఠాని అరెస్టు చేశారు. ఆ తరహాలోనే రియాద్ లో దొంగల ముఠా సంచరిస్తున్నదని పేర్కొన్నారు. రియాద్ పోలీసు ప్రతినిధి కల్నల్ ఫరజ్ అల్ మైమన్ మాట్లాడుతూ దొంగలు అద్దెకు కార్లను తీసుకొని పగలంతా నగరం చుట్టూ తిరిగి దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూసి దోచుకోనున్నారు అని తెలిపారు.
"ప్రాధమిక విచారణ మేరకు పోలీసులు అనుమానితులు నగరంలో కత్తులు మరియు ఇతర మారణాయుధాలతో బెదిరించడం తరువాత 15 మందిని దోచుకున్నారని " ఆల్-మైమన్ చెప్పారు. అతను అనుమానితులను గుర్తించకుండా ఉండేందుకు అద్దెకు కార్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తొమ్మిది మంది ఇథోపియన్లు , ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక సూడాన్ వ్యక్తి ఈ గ్యాంగ్ లో ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఇరవై ఏళ్ళ ప్రాయం వారని తెలిపారు. అల్ మైమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పౌరులు బ్యాంకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అదనపు పహారా పెంచినట్లు ఆయన వివరించారు. నగరంలో ఉన్న నివాసితులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







