చైనాలో భారీ మోసం....
- August 27, 2016
షెంజెన్: బాబాల పేరుతో మోసం చేసిన వారి గురించి విన్నాం.. మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్దపెద్దవాళ్లు తెలుసంటూ డబ్బుకాజేసిన ఘటనలు చూశాం. కానీ వందల ఏళ్ల క్రితం దేశాన్ని పాలించిన రాజునంటూ, ఇంకా బతికే ఉన్నానంటూ మోసం చేయడం ఎక్కడైనా విన్నారా.. వినడానికి విచిత్రంగా ఉన్నా అదే జరిగింది చైనాలో. తాను 300ఏళ్ల నాటి రాజునంటూ.. ఓ సంపన్నురాలిని మోసం చేసి దాదాపు రూ.47కోట్లు కాజేశాడో వ్యక్తి. అసలేం జరిగిందంటే..గువాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన జెంగ్ షుజు అనే మహిళ 2012లో ఓ వ్యాపారం ప్రారంభించింది.తన కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారి ని ఆహ్వానించగా.. వాన్ జియాన్మిన్ అనే వ్యక్తి కలిశాడు. తాను ఫైనాన్షియర్నని చెప్పి.. కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, కొన్ని రోజుల తర్వాత జెంగ్కు వాన్ ఓ వ్యక్తిని స్నేహితుడంటూ పరిచయం చేశాడు. అతడి పేరు క్వియన్లాంగ్. 1735 నుంచి 1796 వరకు చైనాను పాలించిన రాజు క్వియన్లాంగ్. అయితే తానే ఆ రాజునని.. 300ఏళ్లుగా బతికే ఉన్నానని వాన్ స్నేహితుడు జెంగ్కు చెప్పాడు. అమృతం తీసుకోవడం వల్లే తాను ఇన్నేళ్లు బతికానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఇలాంటి విషయాలు నమ్మశక్యంగా ఉండవు. అయితే వాన్, అతడి స్నేహితుడు కలిసి జెంగ్కు మాయమాటలు చెప్పి నమ్మించారు. అంతేగాక, తన రాజప్రసాదంలో భారీగా నిధులున్నాయని, వాటిని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని చెప్పారు.వింతేంటంటే.. వారి మాటలను జెంగ్ నమ్మడమేగాక, రాజ ప్రసాదంలో సొమ్మును విడిపించేందుకు 2 మిలియన్ యువాన్లు కూడా ఇచ్చింది. అంతేగాక, 2014లో షెంజెన్లో ఓ టెక్నాలజీ సంస్థ పెట్టేందుకు వారికి 45 మిలియన్ యువాన్లు ఇచ్చింది. అయితే మొత్తం 47 మిలియన్ యువాన్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 47కోట్లు) డబ్బుతో వాన్, అతడి స్నేహితుడు పరారయ్యారు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాదాపు ఏడాది తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







