భవనంపైనుంచి పడి యువకుడి మృతి
- August 28, 2016
యూఎస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఓ యువకుడు, దుబాయ్లోని ఓ భవనంపైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దుబాయ్లోని అతని తల్లిదండ్రులు నివసిస్తున్న ఓ భవనంలోని 8వ ఫ్లోర్ నుంచి కిందపడిపోయాడా యువకుడు. ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో పడిన వెంటనే అతను ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మెడిసిన్లో విద్యను అభ్యసించిన ఆ యువకుడు, తన కోర్స్ని ఇటీవలే పూర్తి చేసుకుని వచ్చాడు. అతని సోదరి కూడా మెడిసిన్ చదువుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో మృతుడి తల్లిదండ్రులు ఆ అపార్ట్మెంట్లో లేరు. మృతుడు భారతదేశానికి చెందినవాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







