తమ బకాయి వేతనాల కోసం వేచి ఉన్న ఆసియా నిర్వాసితులు

- August 28, 2016 , by Maagulf
తమ బకాయి వేతనాల కోసం వేచి ఉన్న ఆసియా నిర్వాసితులు

మనామా: ఇద్దరు ప్రవాస భారతీయులు తమకు ఓ కంపెనీ నుంచి గత  20 నెలలగా రావాల్సిన  బకాయి వేతనాలపై న్యాయస్థానం వెళ్లగా, న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకొని వారి మాజీ యజమాని ఆ డబ్బుని వెంటనే చెల్లించాలని ఆదేశించిన తరువాత కూడా, తమకు రావాల్సిన వేతనాల కోసం వేచి ఉన్నారు.రాజన్ జార్జ్ మరియు సాజి కుమార్ భారత నిర్వాసితులు  మాక్స్వెల్ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసులు కో విల్ పై కేసు నమోదుచేశారు. అనేక నెలల వేతనాలు రెండో దఫా చెల్లించడానికి  విఫలమైన తర్వాత, కోర్టులో కేసు నమోదు చేశారు. వారిరువురికి  2012 మరియు 2011 సమయంలో అనేక నెలల వేతనాలు  చెల్లిస్తుంచాల్సి ఉంది.అంతేకాక సంస్థతో వారి ఏకపక్ష ఒప్పందాలు రద్దు చేసుకొన్నారు.శ్రామిక ఉన్నత న్యాయస్థానం చెల్లించని వేతనాలు, వారి వార్షిక సెలవులతో  సహా ఇతర బకాయిలు పరిహారంగా జార్జ్ మరియు కుమార్ లకు   2156 బి డి , 4846 బి డి లను కంపెనీ చెల్లించాలని  ఆదేశించింది. అంతేకాక  డబ్బుతో పాటు  ఆ ఇద్దరు ఉద్యోగులకు  ఉద్యోగ ఆనుభవ పత్రాలు వారు తమ సొంత దేశానికి  తిరిగి వెళ్లేందుకు విమాన  టిక్కెట్లు సైతం  కొనుగోలు చేసి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.  సాజి కుమార్ దూసిటింగ్  సూపర్వైజర్ ఉండగా, జార్జ్ జనవరి 2011 నుంచి ఆ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.సాజి కుమార్ తో ఒప్పందం రద్దు చేసుకొని  " తన సేవలు  అవసరం లేదని  ప్రస్తుతం తమ వైపు ఎలాంటి ఉద్యోగాలు లేవని ."కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇద్దరు నిర్వాసితులు బహరేన్ లో  మరో కంపెనీ లో పని చేస్తున్నారు. వారు మొదట్లో పనిచేసిన కష్టార్జితాన్ని అనుకూలంగా తీర్పు రావడంతో సాధ్యమైనంత పరిష్కారం జరుగుతుందని కాబట్టి అవసరమైన చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులని వారు అభ్యర్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com