రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్కు పోటీగా ఎయిర్టెల్..
- August 29, 2016
రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్కు గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీ ఎయిర్టెల్ సిద్ధమైంది. ఎయిర్టెల్ 4జీ, 3జీ మొబైల్ ఇంటర్నెట్ ధరలను తగ్గించింది. ప్రత్యేక స్కీంలో భాగంగా రూ.51కే 1జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ స్కీం వర్తించేందుకు రూ.1498తో మొదట రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.51తో రీఛార్జ్ చేస్తే 28 రోజుల వాలిడిటీతో 1జీబీ 3జీ/4జీ డేటా వస్తుంది. ఇలా 12 నెలల్లో ఎన్నిసార్లైనా ఈ స్కీం కింద రూ.51తో రీఛార్జి చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.అలాగే ఎయిర్టెల్ మరో స్కీం కూడా పెట్టనుంది. రూ.748తో రీఛార్జ్ చేయించుకుంటే ఆరు నెలల పాటు వర్తిస్తుంది.ఈ ఆర్నెల్లలో రూ.99తో రీఛార్జ్ చేయిస్తే 1జీబీ 3జీ/4జీ డేటా వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్యాక్లు ప్రస్తుతం దిల్లీలో అందుబాటులో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో అన్ని సర్కిల్స్లో ప్రవేశపెట్టనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఐడియా, వొడాఫోన్ల దారిలోనే జులైలో ఎయిర్టెల్ కూడా 4జీ, 3జీ డేటా ప్లాన్స్లో వినియోగించుకునే డేటాను పెంచింది.అలాగే ఎయిర్టెల్ ఇటీవల రూ.1,199కి 1జీబీ 3జీ/4జీ డేటా ప్లాన్లో రోమింగ్లో కూడా వాయిస్ కాలింగ్ ఉచితంగా అందించే ఆఫర్ ఇచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







