'కన్నుల్లో నీ రూపమే..' టాకీ పూర్తి
- August 29, 2016
నందు, తేజస్విని ప్రకాశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'కన్నుల్లో నీ రూపమే..'. కొత్త దర్శకుడు బిక్స్ తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమకథా చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఇటీవలే హీరో నందు, ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడు నెలల పాటు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న 'కన్నుల్లో నీ రూపమే..' చిత్రం టాకీ పనులు తాజాగా కంప్లీట్ అయ్యాయి. నందు, తేజస్వినిపై కొన్ని సాంగ్స్ షూటింగ్ కోసం వచ్చే నెలలో కర్ణాటక వెళ్లనుంది మూవీయూనిట్. పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకంపై భాస్కర్ బాసాని నిర్మిస్తున్నారు. సంగీతం - సాకేత్ కోమండూరి, సినిమాటోగ్రఫి- సుభాష్ దొంతి, ఎడిటర్ - మహెందర్ నాథ్.బి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







