ఆఫ్గానిస్థాన్లో వరుస పేలుళ్లు తొమ్మిది మంది పౌరులు మృతి
- August 29, 2016ఆఫ్గానిస్థాన్లో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాలిబన్ తిరుగుబాటుదారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతమైన హెల్మంద్ రాష్ట్రంలో తొలుత బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.
కాగా.. ఘోర్ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లకు సంబంధించిన ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయితే భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్ తిరుగుబాటుదారులు తరచుగా రోడ్ల పక్కన బాంబులు పెడుతుంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు