ఆఫ్గానిస్థాన్లో వరుస పేలుళ్లు తొమ్మిది మంది పౌరులు మృతి
- August 29, 2016ఆఫ్గానిస్థాన్లో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాలిబన్ తిరుగుబాటుదారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతమైన హెల్మంద్ రాష్ట్రంలో తొలుత బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.
కాగా.. ఘోర్ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లకు సంబంధించిన ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయితే భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్ తిరుగుబాటుదారులు తరచుగా రోడ్ల పక్కన బాంబులు పెడుతుంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!