ఆఫ్గానిస్థాన్లో వరుస పేలుళ్లు తొమ్మిది మంది పౌరులు మృతి
- August 29, 2016
ఆఫ్గానిస్థాన్లో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాలిబన్ తిరుగుబాటుదారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతమైన హెల్మంద్ రాష్ట్రంలో తొలుత బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.
కాగా.. ఘోర్ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లకు సంబంధించిన ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయితే భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్ తిరుగుబాటుదారులు తరచుగా రోడ్ల పక్కన బాంబులు పెడుతుంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







