ఆఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్లు తొమ్మిది మంది పౌరులు మృతి

- August 29, 2016 , by Maagulf
ఆఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్లు తొమ్మిది మంది పౌరులు మృతి

ఆఫ్గానిస్థాన్‌లో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాలిబన్‌ తిరుగుబాటుదారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతమైన హెల్మంద్‌ రాష్ట్రంలో తొలుత బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.

కాగా.. ఘోర్‌ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లకు సంబంధించిన ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

అయితే భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్‌ తిరుగుబాటుదారులు తరచుగా రోడ్ల పక్కన బాంబులు పెడుతుంటారని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com