హౌతి షెల్లింగ్లో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
- August 29, 2016
సరదాగా ఆడుకుంటున్న ఆ ఇద్దరు చిన్నారులకు హౌతి షెల్లింగ్ కారణంగా తీవ్రగాయాలయ్యాయి. తొమ్మిదేళ్ళ యాహ్యా, 3 ఏళ్ళ మహ్ది ఆడుకుంటుండగా వారిపై రాకెట్ దాడి జరిగింది. అల్ హుదన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్తానీ కార్మికులు కూడా గాయపడ్డారు. యహ్యా, నజ్రాన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మెహ్ది మరియు పాకిస్తానీ వలసదారుడు కింగ్ ఖాలిద్ ఆసుపత్రిలో చేరారు. మెహది మొహంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాకిస్తానీ వలసదారుడి పరిస్థితి విషమంగా ఉంది. గత పది రోజుల్లో నజ్రాన్లో మృతి చెందినవారి సంఖ్య 10కి చేరుకుంది. ఇందులో ఐదుగురు సిటిజన్స్ ఉన్నారు. 14 మంది గాయాల పాలయ్యారు. ఇరాన్ ప్రోత్సాహంతో హౌతి మిలిటెంట్లు ప్రజల ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. స్కూళ్ళపైన కూడా వీరు జాలి చూపించడంలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







