విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇంకొక్కడు'

- August 30, 2016 , by Maagulf
విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇంకొక్కడు'

తమిళ అగ్రకథానాయకుడు విక్రమ్‌ నటించిన 'ఇంకొక్కడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఆనంద్‌శంకర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సెన్సార్‌ పూర్తి చేసుకుందని ట్వీట్‌ చేశారు. నిత్యా మేనన్‌, నయనతార ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. థమీన్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై శిభు థమీన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యారిస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి సెన్సారు బోర్డు సభ్యులు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని సమాచారం. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com