విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో మరో ముందడుగు
- August 30, 2016
విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి దిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్తో అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. కొద్దిరోజుల క్రితం వరకు మెట్రో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే రూ.300 కోట్లు నిధులు విడుదల చేయడంతో ఈ ప్రక్రియ వూపందుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో భూసేకరణ చేపట్టనున్నారు. గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచినా వాటి గడువు పూర్తయినందున రద్దు చేశారు. దీంతో త్వరలోనే మరో దఫా టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను అధికారులు విరమించుకున్నారు.
రుణమంజూరు ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు జైకా నిబంధనలు ప్రాజెక్టుని ముందుకు సాగనిచ్చేలా లేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచబ్యాంకుతో పాటు అనేక విదేశీ సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్న తరుణంలో నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురుకావని మెట్రోరైల్ ఎండీ రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







