అబూధాబీ టవర్లలో అగ్నిప్రమాదం 13 మంది ఊపిరందక సతమతం
- August 30, 2016
అబూధాబీ : స్థానిక జాహితా ప్రాంతంలో మంగళవారం రెండు నిర్మాణంలో ఉన్న భవనాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదమూడు మంది, మరో పది మంది అగ్నిమాపక దళ సభ్యులు ఊపిరి అంధక స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు..
అబూధాబీ సివిల్ డిఫెన్స్ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అల్ అన్సారీ, మాట్లాడుతూ కార్యకలాపాలు గది వద్దకు 10:50 గంటలకు అగ్నిప్రమాదం గూర్చి సమాచారం అందుకొన్నామని నివేదిక అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెంటనే ఫైర్ ఇంజన్లు పంపినట్లు ఆయన తెలిపారు. ముఖ్యులైన ఇంటర్వెన్షన్ యూనిట్ నుండి ఒక ఉమ్మడి బృందం రెండు టవర్లలో చిక్కుకున్నపలువుర్ని ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని నివాస భవనాలలో నుంచి వారినీ రక్షించి ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అందించిన తాత్కాలిక ఆశ్రయంలో వారినీ ఉంచారని ఆయన తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, సిటీ టెర్మినల్ పక్కన ఒక అబూ ధాబీ మాల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 27 అంతస్థుల భవనంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అగ్ని రాజుకొని మంటలు వేగంగా వ్యాపించాయి. ఆరేడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు రంగంలోనికి దిగేయి. మరి కొన్ని వాహనాలు మార్గం మధ్యలో ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ మెషిన్ లో ఏర్పడిన తప్పు కారణంగా అగ్ని ప్రామాదం జరగడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఈ అగ్ని ప్రమాదం నిర్మాణ ప్రాంతంలో 600 మంది కార్మికులు ఉండగా జరిగినట్లు ఒక కార్మికుడు తెలిపాడు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









