అఫ్ఘానిస్థాన్ లో 97మంది తాలిబన్ మిలిటెంట్లు హతం
- August 31, 2016
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ లో ఉగ్రవాదులు అంతం అయ్యారు. పలు ప్రావిన్స్ లో 97 మంది తాలిబన్ ఉగ్రవాదులు అంతం అయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు నిర్వీర్యం చేశారు.
ఈ ఆపరేషన్ లో 97 మంది ఉగ్రవాదులతో పాటు 12 మంది సైనికులు మరణించారని వెల్లడించారు. పక్టియా ప్రావిన్స్ లోని జని ఖేల్ జిల్లాలో భద్రతా దళాల దాడిలో 57 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. బఘ్లాన్ ప్రావిన్స్ లో 15 మంది, హెల్మండ్, కాబుల్, కుండుజ్ ప్రావిన్స్ లో 25 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







