గవర్నర్ విద్యసాగర్ రావు కు అదనపు బాధ్యతలు

- August 31, 2016 , by Maagulf
గవర్నర్ విద్యసాగర్ రావు కు అదనపు బాధ్యతలు

తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పదవీకాలం బుధవారంతో ముగిసింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. రోశయ్య స్థానంలో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. రోశయ్య పదవీకాలం పెంచాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కేంద్రాన్ని కోరినట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

మరోవైపు గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాశ్‌ కోహ్లికి మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com