మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ పీరియడ్‌ ముగిసింది

- August 31, 2016 , by Maagulf
మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ పీరియడ్‌ ముగిసింది

వేసవి సందర్భంగా జూన్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు కార్మికుల కోసం మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ విధించబడింది. నిన్నటితో ఆ పీరియడ్‌ ముగిసింది. ఈ రూల్‌ ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు మూడు గంటలపాటు కార్మికులకు పని నుంచి బ్రేక్‌ లభిస్తుంది. ఈ ఏడాది, మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ పీరియడ్‌లో మొత్తం 170 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించగా, వాటిపై తగిన చర్యలు తీసుకోబడ్డాయి. గత ఏడాది 391 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించి, కార్మికుల్ని బ్రేక్‌ పీరియడ్‌లో ఎండ ప్రాంతంలో కార్మికులతో పని చేయించి, మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికల్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా, ఒమన్‌లో ఉష్ణోగ్రతలు ఇంకా 45 డిగ్రీలకు అటూ ఇటూగానే ఉన్నాయనీ, ఈ ఉష్ణోగ్రతలు ఇంకొన్ని రోజులపాటు కొనసాగుతాయని తెలియవస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com