కజికిస్తాన్ లో మెడికల్ విద్యార్థులకు చేదు అనుభవం
- September 01, 2016
కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ చేస్తున్న తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ చేస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికి వచ్చిన తెలుగు విద్యార్థులు గురువారం తిరుగు పయనం అయ్యారు. అయితే వారిని యూనివర్శిటీ హాస్టళ్లోకి సిబ్బంది అనుమతించ లేదు. అడ్మిషన్ టైంలో కన్సల్టెన్సీ చెప్పిన ఫీజుకంటే రెట్టింపు చెల్లిస్తేనే లోపలికి అనుమతి అంటూ రాత్రి సమయం అని కూడా చూడకుండా యాజమాన్యం హాస్టల్ రూమ్ లకు తాళాలు వేసింది.
వర్షం కూడా కురవడంతో యూనివర్శిటీ బయటే చలిలో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం వరకైనా అనుమతి ఇవ్వాలని కోరినా, ఒప్పుకోకుండా దుర్భాషలాడారంటూ విద్యార్థులు(అబ్బాయిలు,అమ్మాయిలు) తమ తల్లిదండ్రులకు వాట్సాప్ లో గోడువెల్లబోసుకున్నారు.
పిల్లల మెసెజ్ లతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ లో చేర్పించిన ఎన్ఈఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. అయితే వారు కూడా పట్టించుకోవటంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
200 మంది తెలుగు విద్యార్థులు ఎన్ఈఓ కన్సల్టేన్సీ ద్వారా గత ఏడాది కజకిస్తాన్ లో ఎంబీబీఎస్ లో చేరారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చి దాదాపు 50 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ నుంచి కజకిస్తాన్ కు తిరిగి వెళ్లారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









