ప్రపంచ దేశాలకు అయిలాన్ తండ్రి విజ్ఞప్తి
- September 01, 2016
సిరియాలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న రక్తపాతానికి ఇకనైనా తెరదిం చేందుకు చొరవ చూపాలని సిరియాకు చెందిన అబ్దుల్లా కుర్ది ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో సిరియా నుండి ఐరోపా దేశాలకు వలస వెళ్తూ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిన ఘటనలో టర్కీ తీరానికి చేరిన మూడేళ్ల చిన్నారి ఐలాన్ కుర్ది మృతదేహం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తన కుమారుడు ఐలాన్ కుర్ది వంటి వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఏడాది గడచినా సిరియాలో అశాంతికి తెరపడక పోవటం విచారకరమని ఆయన జర్మనీకి చెందిన ఒక పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో పేర్కొన్నారు.
తన కుమారుడి మృతి అనంతరం ఇటువంటి ఘటనలకు మరోసారి తావివ్వబోమంటూ పలువురు రాజకీయ నేతలు చెప్పిన మాటలు ఇప్పటికీ నీటి మూటలుగానే మిగిలాయన్నారు. సముద్రతీరాన పడివున్న తన కుమారుడి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కదిలించిందని, ప్రతిఒక్కరూ ఏదో ఒకటి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ దిశగా జరిగిందేమీ లేదని, ప్రజలు ఇప్పటికీ వలసబాటలో ప్రాణాలు కోల్పోతూనే వున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యధరా సముద్రంలో తన భార్య, కుమారులను పొట్టనపెట్టుకున్న ఈ విషాద ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న సేపూ తన కుటుంబానికి ఎదురైన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







