ఆగస్ట్‌ 25-31 మధ్యలో బహ్రెయిన్‌లోకి 351,789 మంది

- September 01, 2016 , by Maagulf
ఆగస్ట్‌ 25-31 మధ్యలో బహ్రెయిన్‌లోకి 351,789 మంది

నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్‌ మరియు రెసిడెన్స్‌ ఎఫైర్స్‌ (ఎన్‌పిఆర్‌ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లోకి ఆగస్ట్‌ 25-31 మధ్యలో ప్రవేశించినవారి సంఖ్య 351,789గా ఉంది. ఈ వారం వివరాల్ని బట్టి చూస్తే, సౌదీ అరేబియా మరియు గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ దేశాల నుంచి కింగ్‌ ఫవాద్‌ కాజ్‌వే మీదుగా 279,258 మంది వచ్చారనీ, బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ మీదుగా 72,046 మంది, పోర్టుల ద్వారా 485 మంది బహ్రెయిన్‌లోకి వచ్చారు. 25 కిలోమీటర్ల నిడివిగల ఫహాద్‌ కాజ్‌వే, బహ్రెయిన్‌ మరియు సౌదీ అరేబియా మధ్య ఉంది. దీన్ని 1986, నవంబర్‌ 26న ప్రారంభించారు. మిలియన్ల మంది ఈ కాజ్‌ వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అరబ్‌ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమిది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com