భారత్, వియత్నాం మధ్య 12 కీలక ఒప్పందాలు
- September 02, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం అర్థరాత్రి వియత్నాం చేరుకున్న ప్రధాని మోదీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో భద్రతా దళాల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. హోచిమిన్ నివసించిన ఇంటిని మోదీ సందర్శించారు.
వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్లో ఆదేశ ప్రధానితో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు.
అనంతరం ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని పేర్కొన్నారు.
వియత్నాంతో ఒప్పందం వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు. వియత్నాం బలమైన ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాం ప్రజలు చూపిన అభిమానం మనసును ఆకట్టుకుందని పేర్కొన్నారు
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ