మొబైల్ షాపుల లోకలైజేషన్ తొలిదశ పూర్తి
- September 03, 2016
శుక్రవారంతో తొలి దశ మొబైల్ షాపుల లోకలైజేషన్ పూర్తయ్యింది. శుక్రవారం నుంచి రెండో దశ ప్రారంభమయ్యింది. తొలి దశలో 50 శాతం మొబైల్ షాపులు పూర్తిగా సౌదీకి చెందినవారిలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు. దాంతో చాలావరకు దుకాణాలు మూతబడ్డాయి. వలసదారులు నిర్వహిస్తున్న దుకాణాలు మూతబడ్డంతో సౌదీ పౌరులు నిర్వహిస్తున్న దుకాణాలు కళకళ్ళాడుతున్నాయి. రెండో దశలో పూర్తిగా 100 శాతం మొబైల్ దుకాణాలు సౌదీ పౌరుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. సౌదీ లోకలైజేషన్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిర్ణయం ద్వారా సౌదీ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్ళే డబ్బు, సౌదీ అవసరాల కోసమే ఉపయోగపడ్తుందని అధికారులు అంటున్నారు. అయితే శుక్రవారం నాటి పరిస్థితుల్ని అంచనా వేసినప్పుడు, శుక్రవారం సెలవు దినం కావడంతో చాలా దుకాణాలు మూతపడి ఉన్నాయి. దాంతో, పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ స్థానిక దుకాణదారులు చెబుతున్నదాన్ని బట్టి సౌదీ లోకలైజేషన్కి మంచి స్పందన వచ్చినట్లు తెలియవస్తోంది. సౌదీలో మొబైల్ ఫోన్ దుకాణాల వ్యాపారం అత్యంత లాభసాటిగా ఉంది. దాంతో ఈ రంగంలో ఇతర దేశాలకు చెందినవారి ఆధిపత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సౌదీ లోకలైజేషన్కి మొబైల్ దుకాణాల్ని ఎంపిక చేసింది. ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







