మొబైల్ షాపుల లోకలైజేషన్ తొలిదశ పూర్తి
- September 03, 2016
శుక్రవారంతో తొలి దశ మొబైల్ షాపుల లోకలైజేషన్ పూర్తయ్యింది. శుక్రవారం నుంచి రెండో దశ ప్రారంభమయ్యింది. తొలి దశలో 50 శాతం మొబైల్ షాపులు పూర్తిగా సౌదీకి చెందినవారిలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు. దాంతో చాలావరకు దుకాణాలు మూతబడ్డాయి. వలసదారులు నిర్వహిస్తున్న దుకాణాలు మూతబడ్డంతో సౌదీ పౌరులు నిర్వహిస్తున్న దుకాణాలు కళకళ్ళాడుతున్నాయి. రెండో దశలో పూర్తిగా 100 శాతం మొబైల్ దుకాణాలు సౌదీ పౌరుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. సౌదీ లోకలైజేషన్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిర్ణయం ద్వారా సౌదీ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్ళే డబ్బు, సౌదీ అవసరాల కోసమే ఉపయోగపడ్తుందని అధికారులు అంటున్నారు. అయితే శుక్రవారం నాటి పరిస్థితుల్ని అంచనా వేసినప్పుడు, శుక్రవారం సెలవు దినం కావడంతో చాలా దుకాణాలు మూతపడి ఉన్నాయి. దాంతో, పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ స్థానిక దుకాణదారులు చెబుతున్నదాన్ని బట్టి సౌదీ లోకలైజేషన్కి మంచి స్పందన వచ్చినట్లు తెలియవస్తోంది. సౌదీలో మొబైల్ ఫోన్ దుకాణాల వ్యాపారం అత్యంత లాభసాటిగా ఉంది. దాంతో ఈ రంగంలో ఇతర దేశాలకు చెందినవారి ఆధిపత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సౌదీ లోకలైజేషన్కి మొబైల్ దుకాణాల్ని ఎంపిక చేసింది. ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







