మొబైల్ షాపుల లోకలైజేషన్ తొలిదశ పూర్తి
- September 03, 2016
శుక్రవారంతో తొలి దశ మొబైల్ షాపుల లోకలైజేషన్ పూర్తయ్యింది. శుక్రవారం నుంచి రెండో దశ ప్రారంభమయ్యింది. తొలి దశలో 50 శాతం మొబైల్ షాపులు పూర్తిగా సౌదీకి చెందినవారిలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు. దాంతో చాలావరకు దుకాణాలు మూతబడ్డాయి. వలసదారులు నిర్వహిస్తున్న దుకాణాలు మూతబడ్డంతో సౌదీ పౌరులు నిర్వహిస్తున్న దుకాణాలు కళకళ్ళాడుతున్నాయి. రెండో దశలో పూర్తిగా 100 శాతం మొబైల్ దుకాణాలు సౌదీ పౌరుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. సౌదీ లోకలైజేషన్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిర్ణయం ద్వారా సౌదీ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్ళే డబ్బు, సౌదీ అవసరాల కోసమే ఉపయోగపడ్తుందని అధికారులు అంటున్నారు. అయితే శుక్రవారం నాటి పరిస్థితుల్ని అంచనా వేసినప్పుడు, శుక్రవారం సెలవు దినం కావడంతో చాలా దుకాణాలు మూతపడి ఉన్నాయి. దాంతో, పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ స్థానిక దుకాణదారులు చెబుతున్నదాన్ని బట్టి సౌదీ లోకలైజేషన్కి మంచి స్పందన వచ్చినట్లు తెలియవస్తోంది. సౌదీలో మొబైల్ ఫోన్ దుకాణాల వ్యాపారం అత్యంత లాభసాటిగా ఉంది. దాంతో ఈ రంగంలో ఇతర దేశాలకు చెందినవారి ఆధిపత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సౌదీ లోకలైజేషన్కి మొబైల్ దుకాణాల్ని ఎంపిక చేసింది. ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









