చైల్డ్ సేఫ్టీపై దుబాయ్ ట్యాక్సీ, హుండై 'ఎంఓయూ'
- September 03, 2016
రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ)కి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్, అలాగే హుండై - జుమా అల్ మజిద్ మధ్య మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ) కుదిరింది. ట్యాక్సీల్లో చిన్న పిల్లల భద్రత విషయమై ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ సిఇఓ డాక్టర్ యూసుఫ్ మొహమ్మద్ అల్ అలి, హుండై మోటర్ గ్రూప్ ప్రెసిడెంట్ ఎక్సెల్ డ్రెయర్ ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. డిటిసి ట్యాక్సీ క్యాబ్లలో చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేక సీట్ల ఏర్పాటు విషయంలో హుండై సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది ఈ ఒప్పందం ప్రకారం. ప్రయాణీకుల భద్రత నేపథ్యంలో దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ తమతో చేసుకున్న ఒప్పందం పట్ల హుండై వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ, అందులో ఇది కూడా ఒకటని డ్రెయర్ చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







