దుబాయ్ నుంచి హజ్కి తొలి అదనపు ఫ్లైట్
- September 03, 2016
దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి తొలి అదనపు విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 400 మంది ప్రయాణీకులతో బయల్దేరింది. మొత్తం 12 అదనపు విమానాల్ని దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి హజ్ యాత్రీకుల కోసం ఈ హజ్ సీజన్లో ఏర్పాటు చేశారు. హజ్కి వెళ్ళే ముందు దుబాయ్లో ఒకరోజు ఆగేవారి ప్రయాణీకుల సంఖ్య 16,000 వరకు ఉంటుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ హజ్ కమిటీ హెడ్ మొహమ్మద్ అల్ మర్జోకి చెప్పారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హజ్ యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందిస్తున్నామని అధికారులు తెలిపారు. టెర్మినల్ వన్లో ఎనిమిది డెడికేటెడ్ కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. నాలుగు కౌంటర్లను రెండో టెర్మినల్లోనూ, మూడో టెర్మినల్లో 14 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2500 మంది ఎమిరేటీలు, అలాగే దుబాయ్లో నివసిస్తున్న వలసదారులు ఈ ఏడాది హజ్ నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు. దుబాయ్ ఎయిర్పోర్టులు డ్రాపింగ్, పికప్ కోసం వచ్చేవారికి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది హజ్ సందర్భంగా. అలాగే ఆరోగ్యపరమైన చెకప్స్ కోసం కూడా తగిన ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







