దుబాయ్ నుంచి హజ్కి తొలి అదనపు ఫ్లైట్
- September 03, 2016
దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి తొలి అదనపు విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 400 మంది ప్రయాణీకులతో బయల్దేరింది. మొత్తం 12 అదనపు విమానాల్ని దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి హజ్ యాత్రీకుల కోసం ఈ హజ్ సీజన్లో ఏర్పాటు చేశారు. హజ్కి వెళ్ళే ముందు దుబాయ్లో ఒకరోజు ఆగేవారి ప్రయాణీకుల సంఖ్య 16,000 వరకు ఉంటుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ హజ్ కమిటీ హెడ్ మొహమ్మద్ అల్ మర్జోకి చెప్పారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హజ్ యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందిస్తున్నామని అధికారులు తెలిపారు. టెర్మినల్ వన్లో ఎనిమిది డెడికేటెడ్ కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. నాలుగు కౌంటర్లను రెండో టెర్మినల్లోనూ, మూడో టెర్మినల్లో 14 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2500 మంది ఎమిరేటీలు, అలాగే దుబాయ్లో నివసిస్తున్న వలసదారులు ఈ ఏడాది హజ్ నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు. దుబాయ్ ఎయిర్పోర్టులు డ్రాపింగ్, పికప్ కోసం వచ్చేవారికి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది హజ్ సందర్భంగా. అలాగే ఆరోగ్యపరమైన చెకప్స్ కోసం కూడా తగిన ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







