చేప పులావ్
- September 03, 2016
కావలసినవి : రెండు కప్పుల సన్న బియ్యం, సరిపడినంత ఉప్పు రెండు టీస్పూన్ల పంచదార, ఒక బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, మూడు యాలకులు, రెండు లవంగాలు, మూడు టేబుల్స్పూన్ల నెయ్యి, 300 గ్రాముల బోన్లెస్ చికెన్, నాలుగు టేబుల్స్పూన్ల మైదా పిండి, చేప ముక్కలు వేగించడానికి సరిపడా నూనె.
ఎలా చేయాలి
చేప ముక్కలపై ఉప్పు చ ల్లి మైదా పిండిని రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముక్కలపై మైదా అతుక్కుంటుంది. నూనె వేడిచేసి చేప ముక్కలను మరీ కరకరలాడేట్టు కాకుండా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత నెయ్యి వేడిచేసి మసాలా దినుసులు వేసి చిటపటమనే వరకు ఉంచి బియ్యం వేసి మరో నాలుగు నిముషాలు వేగించాలి. దీనిలో పంచదార, నాలుగు కపల నీళ్లు, ఉప్పు కలపాలి. సెగను మరీ ఎక్కువ, తక్కువ కాకుండా పెట్టండి. మూతపెట్టి అన్నం ఉడికే వరకు ఉంచాలి.
దీనిలో వేగించిన చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలపాలి. మళ్లీ మూతపెట్టి సెగ తగ్గించి ఏడు నిముషాల పాటు ఉడికించాలి. దీన్ని బూందీ రైతాతో తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









