కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి వికె సింగ్
- September 04, 2016భారత కేంద్ర మంత్రి (సహాయ) జనరల్ వికె సింగ్ (ఎక్సటర్నల్ బఎఫైర్స్) రెండు రోజులపాటు కువైట్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, కువైట్ అధికార వర్గాలతో కువైట్లోని భారతీయ వలసదారుల సమస్యలపై చర్చించనున్నారు. అలాగే జనరల్ వికె సింగ్, కువైట్లోని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, మినిస్టర్ ఆఫ్ అమిరి దివాన్ తదితరులతో చర్చలు జరుపుతారు. కువైట్లోని భారతీయ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. కువైట్లోని వలసదారుల్లో భారతీయుల సంఖ్యే అధికం. బుధవారం అంటే సెప్టెంబర్ 7న ఉదయం 6.30 నిమిషాల ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమై కువైట్లో వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. ఈ సమావేశంలో రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్స్, ఇండియన్ స్కూల్స్ ప్రతినిథులు, భారతీయ కంపెనీలు మరియు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ప్రతినిథులు పాల్గొంటారు. నెలల తరబడి అపరిష్కృతంగా ఉన్న అంశాలకు వికె సింగ్ పర్యటనతో మోక్షం లభిస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక