కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి వికె సింగ్
- September 04, 2016
భారత కేంద్ర మంత్రి (సహాయ) జనరల్ వికె సింగ్ (ఎక్సటర్నల్ బఎఫైర్స్) రెండు రోజులపాటు కువైట్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, కువైట్ అధికార వర్గాలతో కువైట్లోని భారతీయ వలసదారుల సమస్యలపై చర్చించనున్నారు. అలాగే జనరల్ వికె సింగ్, కువైట్లోని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, మినిస్టర్ ఆఫ్ అమిరి దివాన్ తదితరులతో చర్చలు జరుపుతారు. కువైట్లోని భారతీయ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. కువైట్లోని వలసదారుల్లో భారతీయుల సంఖ్యే అధికం. బుధవారం అంటే సెప్టెంబర్ 7న ఉదయం 6.30 నిమిషాల ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమై కువైట్లో వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. ఈ సమావేశంలో రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్స్, ఇండియన్ స్కూల్స్ ప్రతినిథులు, భారతీయ కంపెనీలు మరియు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ప్రతినిథులు పాల్గొంటారు. నెలల తరబడి అపరిష్కృతంగా ఉన్న అంశాలకు వికె సింగ్ పర్యటనతో మోక్షం లభిస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







