కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి వికె సింగ్
- September 04, 2016
భారత కేంద్ర మంత్రి (సహాయ) జనరల్ వికె సింగ్ (ఎక్సటర్నల్ బఎఫైర్స్) రెండు రోజులపాటు కువైట్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, కువైట్ అధికార వర్గాలతో కువైట్లోని భారతీయ వలసదారుల సమస్యలపై చర్చించనున్నారు. అలాగే జనరల్ వికె సింగ్, కువైట్లోని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, మినిస్టర్ ఆఫ్ అమిరి దివాన్ తదితరులతో చర్చలు జరుపుతారు. కువైట్లోని భారతీయ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. కువైట్లోని వలసదారుల్లో భారతీయుల సంఖ్యే అధికం. బుధవారం అంటే సెప్టెంబర్ 7న ఉదయం 6.30 నిమిషాల ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమై కువైట్లో వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. ఈ సమావేశంలో రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్స్, ఇండియన్ స్కూల్స్ ప్రతినిథులు, భారతీయ కంపెనీలు మరియు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ప్రతినిథులు పాల్గొంటారు. నెలల తరబడి అపరిష్కృతంగా ఉన్న అంశాలకు వికె సింగ్ పర్యటనతో మోక్షం లభిస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







