మిస్టీరియస్‌ డెత్‌పై విచారణ ప్రారంభం

- September 04, 2016 , by Maagulf
మిస్టీరియస్‌ డెత్‌పై విచారణ ప్రారంభం

షార్జా: షార్జా పోలీసులు, ఇటీవల షార్జాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతుడు భారతదేశానికి చెందిన 55 ఏళ్ళ వ్యక్తి. అల్‌ బుతైనాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడమ చేతిపై తీవ్రమైన గాయం ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పారా మెడిక్స్‌, సిఐడి విభాగం మృతుడి అపార్ట్‌మెంట్‌కి చేరుకుని విచారిస్తున్నాయి. మృతదేహాన్ని అల్‌ కువైటి హాస్పిటల్‌కి తరలించి, ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీకి పంపనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com