విజయ్ దర్శకత్వంలో సాయేషా సైగల్
- September 05, 2016
'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయేషా సైగల్ తమిళ చిత్ర పరిశ్రమలోకి తేరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో సాయేషా కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించినట్లు జయం రవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా ఎగ్జైటింగ్గా ఉందని సాయేషా ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయం రవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. హరీశ్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన సాయేషా నటించిన 'శివాయ్' చిత్రం అక్టోబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









