తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు
- September 05, 2016

వినాయకచవితి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ ఇంట వేడుకలను షేర్ చేశారు. తొలిసారి పండుగ జరుపుకున్నట్లు హీరోయిన్ చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. స్వతహాగా పంజాబీ అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిలైపోవడంతో తెలుగు సంప్రదాయాలను కూడా చార్మీ పాటిస్తోంది.
చిరంజీవి, రాంచరణ్ తదితరులు తమ ఇంట్లోనే గణపతి పూజ చేసుకుని.. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ పూజలో దర్శకుడు వీవీ వినాయక్ కూడా పాల్గొన్నారు.
షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్న వరుణ్ తేజ్ ఇంట్లో పండుగ సందడిని షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, దేవీ శ్రీ ప్రసాద్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అల్లు శిరీష్ లు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.





తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







