ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం..

- September 06, 2016 , by Maagulf
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం..

 ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. టియుని నుంచి వికాశ్‌నగర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు టియుని వద్ద బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు టియుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, గవర్నర్ కేకే పాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com