10 ఫుడ్ ఔట్లెట్స్ మూసివేత
- September 07, 2016
దోహా: నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా దోహా మునిసిపాలిటీ - మునిసిపల్ కంట్రోల్డ్ డిపార్ట్వమెస్త్రంట్కి చెందిన హెల్త్ కంట్రోల్ సెక్షన్ 10 ఫుడ్ ఔట్లెట్స్ని మూసివేయించింది. మొత్తం 1,430 తనిఖీల్ని హెల్త్ కంట్రోల్ సెక్షన్ నిర్వహించి, 10 చోట్ల నిబంధనల అతిక్రమణల్ని గుర్తించింది.మొత్తం 150 నివేదికలు, లా నెంబర్ 3 (1975)ని ఉల్లంఘించినట్లుగా తేలింది. మరో 9 నివేదికలు, లా నెంబర్ 8 (1990)ని ఉల్లంఘించినట్లు తేల్చాయి. వారం నుంచి నెలరోజులపాటు మూసివేసిన దుకాణాలకు సంబంధించి పరిమితి విధించారు. 9,495 టన్నుల కూరగాయలు, పండ్లు దోహా మార్కెట్లో గత నెలలో తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో 4,705 పండ్లు, 4,790 టన్నుల కూరగాయలు ఉన్నాయి. 96 టన్నుల ఆహార పదార్థాల్ని ఈ సందర్భంగా నాశనం చేశారు అవి తినడానికి ఏమాత్రం మంచివి కావని నిర్ధారించిన తరువాత. మీట్ హెల్త్ యూనిట్ వెటరినరియన్స్, 51793 షీప్స్ని, 615 ఆవుల్ని, 497 ఒంటెల్ని పరీక్షించారు. 12,033 టన్నుల రోటెన్ మీట్ని డిస్ట్రాయ్ చేశారు. 1,235 టన్నుల చేపల్ని పరీక్షించి 9 టన్నుల చేపల్ని డిస్ట్రాయ్ చేశారు. ఆహార పదార్థాల్ని నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే విక్రయించాలనీ, నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







